ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నసురుల్లాబాద్కి చెందిన ఎరుకలి మల్లేశ్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈమేరకు చర్లపల్లి శివారులోని ఓ పొలంలో పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి.. అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.