అటవీ శాఖలోని పలు పోస్టుల భర్తీకి ఆదివారం ఒంగోలు నగరంలోని 10 పరీక్షా కేంద్రాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు తరలివచ్చారు.ఉదయం,మధ్యాహ్నం ఆఫ్లైన్ పద్ధతులో ఈ పరీక్షలు జరిగాయి.డిఆర్ఓ చిన్న ఓబులేసు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.ప్రశాంతంగా పరీక్షలు ముగిసినట్లు డిఆర్ఓ చెప్పారు