కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతు అయినట్లు గురువారం స్థానికులు తెలిపారు. అబ్దుల్ రహీం (20) అనే వ్యక్తి చేపలు కొట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు అయినట్లు తెలిపారు. స్థలానికి ఎన్టీఆర్ ఎఫ్ పోలీసులు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.