Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: గునుపూడిలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు

Bhimavaram, West Godavari | Sep 2, 2025
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు, వైసీపీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు, వైసీపీ నాయకులు రాజు, కొండయ్య, నందమూరి ఆంజనేయులు, బోకూరి విజయ రాజు, బలే యేసు బాబు, గునుపూడి యూత్ వారు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us