రాష్ట్ర ప్రభుత్వం వడగళ్ల వాన తో దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ చెన్నారావుపేట మండల నాయకులు జన్ను రమేష్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో మొక్కజొన్న, మిర్చి, వరి, పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.