జాయింట్ స్టాప్ కౌన్సిల్ ఏర్పాటుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ అన్నారు. కందిలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కౌన్సిల్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. నేరుగా తమ సమస్యలు కలెక్టర్ దృష్టికి ఈ సమావేశంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు.