గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుల కోసం బుధవారం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అనంతపురంలో జరుగునున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ ఎఫెక్ట్తో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తున్నది. 90 శాతం బస్సులను సూపర్ హిట్ సభకు తరలించారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉన్నావని అయినా ఒక్క బస్సు కూడా రాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు డ్రైవర్లు భారీగా డిమాండ్ చేస్తున్నారన్నారు. 19 కిలోమీటర్లు ఉన్న ప్యాపిలికే 50 రూపాయలు అడుగుతున్నారన్నారు. అధికారులు స్పందించి వెంటనే బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.