కంచిలి మండలం అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బుడ్డెపు కృష్ణవేణి కంచిలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాల మేరకు రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కామేశ్తో వివాహమైంది. వివాహనంతరం 3 నెలలు తర్వాత నుంచి అదనంగా 1లక్షా 50 వేలు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె భర్త కామేశ్తోపాటు మరో ఐదుగురిపై స్థానిక ఎస్సై జి.రాజేశ్వరరావు కేసు నమోదుచేశారు.