ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.