మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 44.50 అడుగులకు చేరుకున్నదని అధికారులు తెలిపారు . ప్రస్తుతం 9,96,796 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక (1st Warning) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..