Download Now Banner

This browser does not support the video element.

ఇచ్ఛాపురం: కంచిలి మండలం వరహాలు గడ్డ సమీప జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఢీకొన్న లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్

Ichchapuram, Srikakulam | Apr 27, 2024
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వరహాలుగెడ్డ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారికి మధ్యలో ఉన్న మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఓ లారీ అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని ఆహాకారాలు చేశాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టంగా క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us