Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: దుబ్బాకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Siddipet Urban, Siddipet | Sep 5, 2025
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 21 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ఫీజ్ రియంబర్స్ మెంటు బకాయిలు చెల్లించక పోవడం పై నిరసన వ్యక్తం చేస్తూ ఏ బి వి పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం దుబ్బాక బస్ స్టాండ్ చౌరస్తాలో ఏ బి వి పి నాయకులు సి ఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఎ బి వి పి నగర కార్యదర్శి జశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అని నడుస్తుంది అని చెప్పుకుంటున్న సి ఎం రేవంత్ రెడ్డి కి విద్యార్థుల కష్టాలు, సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us