*"క్వాంటం ఏజ్ బిగిన్స్: పొటెన్షియల్స్ & ఛాలెంజెస్"* అనే అంశంపై "జిల్లా విద్యాశిక్షణా కేంద్రం" కొత్తగూడెం నందు సెమినార్ జరగనున్నదని జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు.ఈ సెమినార్ లో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల నుండి 8 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చు అని ప్రకటించారు.