పెన్పహాడ్ మండలం ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని తుల్జారావుపేట్ గ్రామసన్న, చిన్న కారు రైతుల ఎండిపోయిన వరి పొలాలను సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు రాకపోవడంతో పొట్ట దశకు వచ్చిన వరి పొలాలు మొత్తం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.