మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ నాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ చౌరస్తాలో గురువారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుటామన్నారు. అటువంటి తప్పిదాలు ఎప్పుడూ చేయకూడదని తల్లిదండ్రులకు సూచించారు