ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను తెనాలి త్రీటౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాలకృష్ణ, ముజాహిద్, కార్తీక్, శివ కుమార్, సమీర్ హుస్సేన్లు బాలాజీరావుపేటలో గంజాయి తాగుతుండగా డీఎస్పీ జనార్ధనరావు ఆదేశాలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.