పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం మామిళ్ళకుంట క్రాస్ వద్ద జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అగ్ర నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు ఎంపీటీసీ భరత్ మంత్రి సవిత తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటిగా నిలిచిన కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందని అన్నారు.