వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ జైలర్ లక్ష్మీ శ్రుతిని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సస్పెండ్ చేస్తూ ఉత్తరులను జారీ చేశారు అధికారులు. మూడు రోజుల క్రితం నర్సంపేట సబ్ జైల్లో ఉన్న మహిళా ఖైదీ సుచరిత మృత్చెందిన ఘటనలో సబ్ జైలర్ లక్ష్మీ శ్రుతి విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 13న ఓ కేసులో అరెస్ట్ అయిన సుచరితను నర్సంపేట మహిళా జైలుకు తరలించారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 21న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది విధుల్లో నిర్లక్ష్యం వహించడం వలనే ఆమె మృతి చెందినట్లు తేలడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు అధికారులు.