నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ బుధవారం చీరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది.ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలానీ మాట్లాడుతూ సామాన్యుడు నిత్యావసరాలు కొనలేక,విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతమవుతున్నాడని చెప్పారు.ప్రభుత్వం వీటి నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు