అధికారుల కోసం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలో నేలపాడులో బుధవారం నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయని, వచ్చే నెల 2 గ్రూప్ - డి లో ఉన్న నిర్మాణాలు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. రాజధానిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరన్నారు.