ఈనెల 6వ తేదీ శనివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు అల్లూరి జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అరకులోయ మండలంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం ఉదయం 10 గంటలకు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తారని జిల్లా అధికారులు శుక్రవారం రాత్రి పాడేరులో తెలిపారు. అనంతరం కాఫీ బెర్రీ బోరర్ నష్టాన్ని పరిశీలించనున్నారని తెలిపారు.