ఐదు నెలలుగా ఔట్ స్కోర్సింగ్ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర నాయకుడు సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఆయన మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మార్చడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. ఆస్పత్రికి కేంద్రం రూ.4కోట్లు కేటాయించిందన్నారు.