చందానగర్ ఖజానా జువెలరీ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్లో ప్రిన్స్ కుమార్ భారతి, రోహిత్ కుమార్ రజాక్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జువెలరీలో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపింది రోహిత్గా గుర్తించారు. ఈనెల 12న ఖజానా షోరూంలోకి దుండగులు చొరబడ్డ విషయం తెలిసిందే.