భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్చార్జిగా నియమితులైన యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ ను న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పార్టీ పదాధికారిగా, ఐటి ఇన్చార్జిగా నియమితులు కావడం శుభ పరిణామం అని అన్నారు. ఇలాగే రాబోవు రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్య రాజ్, మధుసూదన్, నారాయణ, అన్వేష్, వెంకటేష్, శ్రీ మన్, రాజశేఖర్, విక్రమ్, రోహన్, తదితరులు పాల్గొన్నారు