మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు శనివారం హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెనుక వాహనం ముందు భాగం దెబ్బతినగా, అందులో ఉన్న మహిళ ముఖానికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు