Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: వేములపాడు లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహారం పై గర్భవతులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం

India | Sep 6, 2025
సంతనూతలపాడు మండలంలోని వేములపాడు అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహార వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ పార్వతి భాయ్ మాట్లాడుతూ.... పౌష్టికాహార లోపం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఐరన్ టాబ్లెట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని గర్భవతులు, బాలింతలకు సూచించారు. ప్రతిరోజు ఆహారంలో కోడిగుడ్లు, ఆకుకూరలు, పాలు ఉండేవిధంగా చూసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us