ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో డిస్పోస్ చేయని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ప్రతి రోజు ఎన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యర్ధాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు