తణుకు పాతఊరులో 11వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీ సమావేశం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి, సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ తమరాపు రమణమ్మ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పందించే రియాక్షన్ ఎలాగ ఉంటాదో చూపిస్తామని హెచ్చరించారు.