ముఠా కార్మికులపై 10 గంటల పని భారాన్ని మోపితే సహించేది లేదని సిపిఐ గుంటూరు నగర సహాయ కార్యదర్శి అంజిబాబు హెచ్చరించారు. క్యాబినెట్లో ఆమోదించిన 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, ఈ నెల 23న ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరులోని సివిల్ సప్లై గోడౌన్ వద్ద గురువారం ముఠా కార్మికులతో కలిసి మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.