సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బీపీ.మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ.. బీపీ మండల్ జయంతిని సామాజిక న్యాయ పోరాట దినంగా పాటిస్తున్నామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషన్ ల సాధన కోసం పోరాడుతామన్నారు. బీసీ రిజర్వేషన్ ల అంశం వచ్చిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ పాలకులు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ కులగణన జరిపి, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ లు క