సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణ కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం సాయంత్రం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి సురేష్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమ సమస్యల పరిష్కారానికి చట్టాలను, ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉయ్యాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.