జీ.మాడుగుల మండలం బూసిపల్లి గ్రామానికి రహదారి, పాఠశాల నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో బడికి వెళ్లే పిల్లలు సుమారు 50 మంది ఉన్నారని, అయితే పాఠశాల, రహదారి లేక కాలినడకన కృష్ణాపురం వెళ్లి చదువుకుంటున్నారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మర్గం మధ్యలో ఉన్న కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తోందన్నారు. దీంతో కట్టెలను వంతెనగా ఏర్పాటు చేసుకుని ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతున్నామని తెలిపారు.