చింతల మానేపల్లి మండలంలో శుక్రవారం మూడు బొలోరో వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ ఘటనలో వాహనాలలో కుక్కిన పరిస్థితుల్లో దాదాపు 8 పశువులు మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన ఆవులను రక్షించి స్థానిక గోషాలలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ పశువుల రవాణా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు,