మడకశిర మండలం మనూరు చెరువులో సోమవారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక టిడిపి నాయకులతో కలిసి చెరువులో దిగి కేరింతలు కొడుతూ ఈత కొట్టారు. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను మనూరు చెరువుకు నింపడంతో సోమవారం జలహారతి కార్యక్రమం నిర్వహించారు.