ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయడం జరుగుతుందని పాడి రైతులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.