ఈనెల 27 నుంచి జరిగే వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచిస్తూ కంభం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి నాగరాజు మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకొని వారిపై అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పి నాగరాజు హెచ్చరించారు. పండగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని డిఎస్పి నాగరాజు కమిటీ సభ్యులను కోరారు.