గాంధీ జయంతిని పురస్కరించుకుని మాంసం, చికెన్ అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ, సూర్యాపేటలో పలు దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు జరిపాయి. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగి పలు చికెన్, మటన్ షాపులను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయిస్తున్న మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తగలబెట్టారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు.