Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
జలదంకి రోడ్డులోని కేవీఆర్ కన్వెన్షన్ వద్ద విద్యుత్ ప్రమాదంలో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. కన్వెన్షన్ ఆర్చికి మరమ్మతులు చేస్తుండగా ఈదుర్ఘటన చోటుచేసుకుంది. కూలీలు ట్రాలీ నిచ్చెనను పక్కకు జరుపుతుండగా పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైరుకు తగిలింది. నలుగురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో గాయపడిన శెట్టిపల్లి లక్ష్మమ్మ, సుబ్బారత్నమ్మ, అరుణ్ కుమార్, చెన్నయ్య కావలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.