Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
దగదర్తి గ్రామంలోని డి.ఆర్ ఛానల్ పనులను ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు శనివారం సందర్శించారు. నాసిరకంగా నిర్మాణాన్ని చేస్తున్న విధానాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను గంగలో కలిపి ఇప్పుడు చేస్తున్న పనులు రైతులకు అన్యాయం జరిగేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీకి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.