2024-25 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా డెలివరీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మిల్లర్లను ఆదేశించారు. గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని అన్నారు. వర్షాకాలం 2024-25 గడువును కేంద్రం సెప్టెంబరు 12 వరకు పొడిగించిందన్నారు.