బీజేపీ గుమ్మడిదల మండల ప్రెసిడెంట్ కావలి ఐలేష్ ను తన నివాసంలో శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐలేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకొంటుదన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేయాలని చూడటం దురదృష్టకరమన్నారు. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించారు.