Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
వైసీపీ 2029లో అధికారంలోకి వస్తుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటున్నారని.. ఆయన ఏమైనా జాతకాలు చెబుతాడా? అని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ప్రశ్నించారు. 'కాకాణికి జాతకాలు చెప్పడం తెలిస్తే ఆయన 87 రోజులు జైలుకు ఎందుకెళ్లారు? జగన్ జైలుకు పోతాడా? లేదా? అనేది ఆయనే జాతకం చూసి చెప్పాలి. జైలుకు పోతానన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు దాక్కున్నాడు' అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రశ్నించారు.