Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం కనపర్తి వద్ద గణేష్ నిమజ్జోత్సవ ప్రాంతాన్ని పరిశీలించిన సిఐ శ్రీకాంత్ బాబు, ఎస్సై రజియా సుల్తానా

India | Aug 28, 2025
నాగులుప్పలపాడు మండలం కనపర్తి వద్ద గణేష్ నిమజ్జనం ఉత్సవ చెరువును సీఐ శ్రీకాంత్ బాబు, ఎస్సై రజియా సుల్తానా గురువారం పరిశీలించారు. నిమజ్జనం ఉత్సవం సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ అక్కడ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ... గణేష్ నిమజ్జోత్సవాలను ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలన్నారు నిర్వాహకులు నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాలను సైతం ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us