శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో పెనుగొండ రెవిన్యూ డివిజనల్ అధికారి యూరియా పంపిణీనీ సందర్శించి , రైతులకు ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం గురించి వివరించారు. అలాగే కల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 173 నందలి లక్ష్మమ్మ వారి పొలం నందు వేసిన మొక్కజొన్న పంట నమోదును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు కల్లూరు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, గ్రామ పెద్దలు, కల్లూరు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.