కవులు, కళాకారులు తమ కవితలను ప్రజలకు దగ్గరగా ఉండేలా రాయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో పాక రాజమౌళి రచించిన పుస్తకాన్ని ఎంపీ ఆదివారం సంగారెడ్డిలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది ఉపాధ్యా యుల మధ్య తాను గడపడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మన ధర్మాన్ని కాపాడే సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.