Download Now Banner

This browser does not support the video element.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిధ దళాల కవాతు

Eluru, Eluru | Mar 28, 2024
ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఏలూరు త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌ వి. వెంకటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది గురువారం సాయంత్రం ఏలూరు 3 టౌన్ పరిసర ప్రాంతాలలో సాయిద దళాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌ వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజలు వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటును వినియోగించుకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలను పోలీస్ శాఖ అందిస్తుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us