Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
కందుకూరులో బుధవారం రాత్రి కరెంట్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. కావలి బుడంగుంట కాలనీకి చెందిన చైతన్య అనే గిరిజన యువకుడు కందుకూరులో కార్పెంటరీ పనికి హెల్పర్గా పనిచేయడానికి వచ్చాడు. ఓ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు చైతన్య తల్లిదండ్రులు గురువారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.