బోధన్లోని ఎస్బీఐలో ఈ నెల 8వ తేదీన చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బోధన్ పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాంకులోకి ఇద్దరు దుండగులు ప్రవేశించగా.. క్యాషియర్ కౌంటర్ వద్ద ఒకరు వీక్షించగా, మరో బాలుడు కౌంటర్ లోపలికి వెళ్లి రూ.5 లక్షల నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారు మధ్యప్రదేశ్కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. శుక్రవారం చోరీ ఘటన సిసి ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు.