హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిరానున్నట్లుతెలిపారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అను అన్నారు.