నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు గ్రామీణ ప్రాంత పేద ప్రజలే వైద్యం కోసం వస్తారని వారికి మెరుగైన వైద్యం అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి రిజిస్టర్ ఏన్సీ అలాగే ఈడిడి తదితర రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులతో వచ్చిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.